మరణించిన ఆర్మీ విద్యార్థిపై టీఆర్‌ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తోంది: Revanth

ABN , First Publish Date - 2022-06-18T16:46:53+05:30 IST

సికింద్రాబాద్ ఆందోళనల్లో మరణించిన ఆర్మీ విద్యార్థిపై టీఆర్ఎస్ జెండా కప్పి చిల్లర రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

మరణించిన ఆర్మీ విద్యార్థిపై టీఆర్‌ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తోంది: Revanth

హైదరాబాద్: సికింద్రాబాద్ ఆందోళనల్లో మరణించిన ఆర్మీ విద్యార్థిపై టీఆర్ఎస్ జెండా కప్పి చిల్లర రాజకీయాలు చేసే ప్రయత్నం  చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth reddy) వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. శవాల మీద పేలాలు ఏరుకుంటున్నరని.. ఎంపీలు దీన్ని ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి అమిత్ షా దగ్గరకు వెళ్ళి ఆ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ కూడా డ్రామాలు ఆపాలన్నారు. కేసీఆర్, మోదీ ఇద్దరు ప్రజా కంటకులే అని దుయ్యబట్టారు. రాకేష్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి తాను నర్సంపేటకు వెళుతున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-06-18T16:46:53+05:30 IST