Revanth reddy: ‘పురుగులన్నం పెట్టే సర్కార్ను ఏ పదాలతో విమర్శించాలి?’
ABN , First Publish Date - 2022-07-30T17:00:20+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా పలు గురుకుల పాఠశాలలో కలుషితాహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతూనే ఉన్నారు.
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పలు గురుకుల పాఠశాల(Gurukula schools)లో కలుషితాహారం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు లోనవుతూనే ఉన్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా మానుకోట గిరిజన బాలికల గురుకులంలో కలుషిత ఆహారం తిని 9 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth reddy) స్పందించారు. ట్విట్టర్ వేదికగా... ‘‘పురుగలన్నం పెట్టి పేద పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే సర్కారును ఏ పదాలతో విమర్శించాలి?... భోగాలు తప్ప త్యాగాలు తెలియని కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు పిల్లల ప్రాణాల విలువ తెలుసా?.. పేద బిడ్డలకు నాణ్యమైన బుక్కెడు బువ్వ పెట్టలేని పాలన దేనికి? భోజనం తినేముందు ఆత్మపరిశీలన చేసుకో కేసీఆర్’’ అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.