Revanth reddy: టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే
ABN , First Publish Date - 2022-08-11T17:20:53+05:30 IST
టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండూ ఒక్కటే అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ (TRS), బీజేపీ (BJP) పార్టీలు రెండూ ఒక్కటే అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) అన్నారు. గురువారం మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో రేవంత్ మాట్లాడుతూ...ఒప్పందం లేకుండానే రాజగోపాల్ రెడ్డి (Rajagopal reddy) రాజీనామాను ఐదు నిమిషాల వ్యవధిలోనే ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. ఎన్నికలకు అంత అర్జెంట్ ఏముందని అన్నారు. హుజురాబాద్ ఎన్నిక టీఆర్ఎస్కు అవసరమని... మునుగోడు ఎన్నిక బీజేపీకి అవసరమని అన్నారు. ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుంటుంన్నారని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.