Revanth reddy: మిడ్ మానేరు నిర్వాసితులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది

ABN , First Publish Date - 2022-08-29T19:48:08+05:30 IST

మిడ్ మానేరు నిర్వాసితులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Revanth reddy: మిడ్ మానేరు నిర్వాసితులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది

హైదరాబాద్: మిడ్ మానేరు (Mid Maneru) నిర్వాసితులకు కాంగ్రెస్ (Congress) అండగా ఉంటుందని టీపీసీసీ  చీఫ్ (TPCC chief) రేవంత్ రెడ్డి (Revanth reddy) స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... మిడ్ మానేరు నిర్వాసితులకు కేసీఆర్ (CM KC) ఇచ్చిన హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. పరిహారం కోసం వేములవాడలో ధర్నా చేస్తున్న మిడ్ మానేరు నిర్వాసితులపై పోలీసుల దౌర్జన్యం దుర్మార్గంగా ప్రవర్తించారన్నారు. ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్న నిర్వాసితుల అరెస్టును ఖండిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ హౌస్ అరెస్టును ఖండిస్తున్నామన్నారు. అరెస్టు చేసిన నిర్వాసితులను తక్షణం విడుదల చేయాలని అన్నారు. కేసీఆర్ హామీ ఇచ్చిన ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీతో పాటు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని రేవంత్  డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-08-29T19:48:08+05:30 IST