Revanth reddy: వైఎస్సార్ దీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్న మహానాయకులు
ABN , First Publish Date - 2022-09-02T18:42:38+05:30 IST
వైఎస్ రాజశేఖర్ రెడ్డి దీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్న మహా నాయకులు అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS rajashekar reddy) దీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్న మహా నాయకులు అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆయన మరణం ఒక్క కాంగ్రెస్ పార్టీ కే కాదు తెలుగు ప్రజలందరికీ తీరనిలోటన్నారు. వైఎస్సార్ భౌతికంగా లేకపోయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని తెలిపారు. ఇందిరమ్మ తర్వాత పేద ప్రజలకు అంతటి సంక్షేమ పథకాలు అందించిన మహా నేత రాజశేఖర్ రెడ్డి (YSR) అని కొనియాడారు. ఆరోగ్య శ్రీ, ఫీజ్ రీఎంబెర్స్ మెంట్, జలయజ్ఞం, ఇందిరమ్మ ఇళ్ల లాంటి పథకాలు పేదలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని రేవంత్ రెడ్డి (TPCC chief) అన్నారు.