Revanth reddy comments: కేసీఆర్ చేస్తున్న తప్పులే.. రాష్ట్రంలో బీజేపీ చేస్తోంది

ABN , First Publish Date - 2022-08-20T19:32:29+05:30 IST

సీఎం కేసీఆర్ చేస్తున్న తప్పులే రాష్ట్రంలో బీజేపీ చేస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

Revanth reddy comments: కేసీఆర్ చేస్తున్న తప్పులే.. రాష్ట్రంలో బీజేపీ చేస్తోంది

నల్గొండ: సీఎం కేసీఆర్ చేస్తున్న తప్పులే రాష్ట్రంలో బీజేపీ (bjp) చేస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) అన్నారు. శనివారం చౌటుప్పల్‌లో మీడియాతో మాట్లాడుతూ... ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వం ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదని తెలిపారు. కేసీఆర్ (CM KCR) సిగ్గులేకుండా ఓట్ల కోసం మునుగోడు (Munugodu by poll)కు వస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడమనే విషప్రయోగం చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలలో గెలిచిన వారిని కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించే గొంతులను కేసీఆర్ అణచివేస్తున్నారని రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-08-20T19:32:29+05:30 IST