ఆ బాధ్యతల నుంచి చినజీయర్ను తప్పించాలి: రేవంత్
ABN , First Publish Date - 2022-03-18T18:32:19+05:30 IST
‘‘సమక్కసారలమ్మ’’లపై త్రిదండి చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: ‘‘సమక్కసారలమ్మ’’లపై త్రిదండి చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ....‘‘తెలంగాణ పౌరుషం, సంస్కృతికి ప్రతీకలైన “సమ్మక్క సారలమ్మ”లను అవమానపరిచిన త్రిదండి చినజీయర్ని యాదగిరిగుట్ట ఆగమశాస్త్ర సలహాదారుడి బాధ్యతల నుండి తక్షణమే కేసీఆర్ తొలగించాలి. మన భక్తి విశ్వాసాలపై దాడి చేసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.