రేపు చంచల్‌గూడ జైలుకు.. రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-06-23T22:14:37+05:30 IST

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై దాడి కేసులో అరెస్టయిన అభ్యర్థులతో ములాఖత్‌ అయ్యేందుకు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురువారం చంచల్‌గూడ జైలుకు వెళ్లనున్నారు..

రేపు చంచల్‌గూడ జైలుకు.. రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై దాడి కేసులో అరెస్టయిన అభ్యర్థులతో ములాఖత్‌ అయ్యేందుకు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురువారం చంచల్‌గూడ జైలుకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోనున్నారు. వారి కోసం అడ్వకేట్‌లను కూడా నియమించన్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. అదే విధంగా అగ్నిపథ్‌ స్కీంకి వ్యతిరేకంగా ఈ నెల 27న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని వారు పిలుపునిచ్చారు.

Updated Date - 2022-06-23T22:14:37+05:30 IST