మంత్రి మల్లారెడ్డి భూకబ్జాపై పోరాటం చేస్తాం: ఉత్తమ్

ABN , First Publish Date - 2021-05-10T16:50:42+05:30 IST

మంత్రి మల్లారెడ్డిపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

మంత్రి మల్లారెడ్డి భూకబ్జాపై పోరాటం చేస్తాం: ఉత్తమ్

హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డిపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సురారంలో మంత్రి మల్లారెడ్డి ఏడెకరాల చెరువు శికం భూమి ఆక్రమించారని...అందులో మెడికల్ కాలేజ్ నిర్మించారని ఆరోపించారు. అది చెరువు శిఖం అని రెవెన్యూ రికార్డుల్లో ఉందని తెలిపారు. మల్లారెడ్డి  కబ్జాపై ఎన్ఎస్యూఐ విద్యార్థులు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపగా... వారిని అరెస్టు చేసి తప్పుడు కేసులు పెట్టి చర్లపల్లి జైలుకు పంపడం సరికాదన్నారు. పోలీసులు న్యాయంగా చట్టబద్ధంగా వ్యవహరించా సూచించారు. కబ్జాదారుల మాటలు వినొద్దన్నారు. మంత్రి మల్లారెడ్డి భూకబ్జాపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన విద్యార్థులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ఉత్తమ్ భరోసా ఇచ్చారు. 

Updated Date - 2021-05-10T16:50:42+05:30 IST