మోసగాడి మరో మోసం జీవో.111 రద్దు: ట్విట్టర్ లో రేవంత్ రెడ్డి
ABN , First Publish Date - 2022-04-21T20:47:22+05:30 IST
చారిత్రక జంటజలాశయాలను కాపాడాల్సిన ప్రభుత్వమే దానిని ఉనికికి ప్రమాదకారిగా మారిందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: చారిత్రక జంటజలాశయాలను కాపాడాల్సిన ప్రభుత్వమే దానిని ఉనికికి ప్రమాదకారిగా మారిందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. మోసగాడి మరో మోసం 111 జీవో రద్దు అంటూ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ఈ జీవోపై 2007లో హైకోర్టు స్టే విధించిన విషయాన్ని రేవంత్రెడ్డి గుర్తు చేశారు. హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా 69 జీవో చెల్లదని ఆయన స్పష్టం చేశారు.కేటీఆర్ రియల్ ఎస్టేట్ మాఫియా కోసమే ఈ డ్రామా అని రేవంత్రెడ్డి ఆరోపించారు.