రాహుల్ ఓయూకు వస్తే కేసీఆర్ కు ఎందుకు భయం? : రేవంత్ రెడ్డి

ABN , First Publish Date - 2022-05-01T20:54:56+05:30 IST

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఓయూను సందర్శిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎందుకు భయం? అని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

రాహుల్ ఓయూకు వస్తే కేసీఆర్ కు ఎందుకు భయం? : రేవంత్ రెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఓయూను సందర్శిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎందుకు భయం? అని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఓయూ ను సందర్శించడానికి విసికి మా జగ్గారెడ్డి, విహెచ్ లు అనుమతి కోరారు. ఆదివారం జగ్గారెడ్డి, విహెచ్ లు ఓయూను వస్తే ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఓయూకు రాకుండా  రాహుల్ ను అడ్డుకుంటున్నారంటే కేసీఆర్ మనస్తత్వం ఏంటో తెలంగాణ సమాజం గ్రహించాలని అన్నారు.


టీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ బానిసలు మాట్లాడే మాటల పై నేను మాట్లాడనని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నేతలను అమరవీరుల కుటుంబాలు ,తెలంగాణ సమాజం చెప్పులతో కొట్టాలని అన్నారు. రబ్బరు చెప్పులు లేనోడు గూడ రాహుల్ గాంధీ గురించి మాట్లాడతాడా? అంటూ ప్రశ్నించారు. రాహుల్ ఓయూ సందర్శించడానికి వస్తే టీఆర్ఎస్ పార్టీనాయకులు ఎందుకు అడ్డుకుంటామనడం సిగ్గుచేలని అన్నారు.

Updated Date - 2022-05-01T20:54:56+05:30 IST