టీఆర్‌ఎస్ నేతల భూదాహంపై కోర్టుకు వెళ్తాం : ఉత్తమ్

ABN , First Publish Date - 2021-05-07T22:14:06+05:30 IST

అధికార టీఆర్‌ఎస్ నేతలు పేదల భూములను రాబందుల్లా తింటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి

టీఆర్‌ఎస్ నేతల భూదాహంపై కోర్టుకు వెళ్తాం : ఉత్తమ్

హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్ నేతలు పేదల భూములను రాబందుల్లా తింటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు. భూములు లాక్కోవడానికే ప్రజా ప్రతినిధులైనట్లు టీఆర్‌ఎస్ వాళ్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కేబినెట్ లో ఉంటూ మంత్రులే దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు అత్యంత జాగరకూతతో ఉంటూ, అధికార పార్టీ నేతల భూ అక్రమాల వివరాలు అందించాలని ఉత్తమ్ సూచించారు. భూముల విషయంలో తాము గవర్నర్‌కు లేఖ రాస్తామని, భూముల దొంగలపై ఆధారాలతో సమా కోర్టును ఆశ్రయిస్తామని ఆయన ప్రకటించారు. టీఆర్‌ఎస్ నేతల భూకబ్జాలపై విచారణ జరగాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. 


Updated Date - 2021-05-07T22:14:06+05:30 IST