ఎంబీడీ కార్మికులకు 50 శాతం భృతి ఇవ్వాలి: సీఐటీయూ
ABN , First Publish Date - 2020-10-27T06:55:20+05:30 IST
లాక్డౌన్ కాలానికి సంబంధించి.. ఎంబీడీ ఫ్యాక్టరీ కార్మికులకు 50 శాతం జీతం ఇవ్వాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు.
చిత్తూరు రూరల్, అక్టోబరు 26: లాక్డౌన్ కాలానికి సంబంధించి.. ఎంబీడీ ఫ్యాక్టరీ కార్మికులకు 50 శాతం జీతం ఇవ్వాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఈఎస్ఐ కార్యాలయం ఎదుట కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు చైతన్య మాట్లాడుతూ.. లాక్డౌన్ విధించిన నాటినుంచి కార్మికులకు ఫ్యాక్టరీ యాజమాన్యం పని ఇవ్వకుండా పస్తులు పెట్టిందని ఆరోపించారు. లాక్డౌన్ కాలానికి తమ వాటా చెల్లించిన కార్మికులందరికీ 50 శాతం జీతాన్ని ఈఎస్ఐ చెల్లించాలని కోరారు. నాయకులు వెంకటేష్, రమేష్బాబు, సుమతి, శాంతి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.