4,56,317మందికి రైతు భరోసా

ABN , First Publish Date - 2020-10-28T11:03:25+05:30 IST

రైతుల సంక్షేమం కోసం సీఎం జగన్‌ అనేక పథకాలు ప్రవేశపెట్టారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చెప్పారు.

4,56,317మందికి రైతు భరోసా

తిరుపతి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి):రైతుల సంక్షేమం కోసం సీఎం జగన్‌ అనేక పథకాలు ప్రవేశపెట్టారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చెప్పారు.  రైతు భరోసా రెండో విడత కార్యక్రమంలో భాగంగా తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన  లబ్ధిదారులకు  చెక్కులందించారు. ఈ సందర్భంగా  నారాయణ స్వామి మాట్లాడుతూ పెట్టుబడి సాయంగా 4,56,371మంది రైతు కుటుంబాల ఖాతాల్లోకి  రూ91.54 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు.వీరిలో 373మంది కౌలు రైతులు కూడా వున్నారన్నారు.రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.2వేలు, పీఎం కిసాన్‌ ద్వారా మరో రూ.2వేలు జమ చేశామన్నారు.కలెక్టర్‌ భరత్‌గుప్తా, జేసీ మార్కొండేయులు, అగ్రికల్చర్‌ ఇన్‌చార్జి జేడీ దొరసాని, డీడీఏ శివకుమార్‌, ఏడీఏ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిప్యూటీ సీఎంకు  పలువురు వినతిపత్రాలు అందజేశారు. 

Updated Date - 2020-10-28T11:03:25+05:30 IST