క్రికెట్ బెట్టింగ్ కడుతున్న ఐదుగిరి అరెస్టు
ABN , First Publish Date - 2020-10-28T11:06:43+05:30 IST
క్రికెట్ బెట్టింగ్ కడుతున్న ఐదుగురిని తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరాలను సీఐ శివప్రసాద్రెడ్డి మంగళవారం వెల్లడించారు.
రూ.16.5 వేల నగదు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం
తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 27: క్రికెట్ బెట్టింగ్ కడుతున్న ఐదుగురిని తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరాలను సీఐ శివప్రసాద్రెడ్డి మంగళవారం వెల్లడించారు. ఈస్ట్ పోలీసులకు అందిన సమాచారం మేరకు ఎస్ఐ ఇమ్రాన్ ఆధ్వర్యంలో సిబ్బంది దొడ్డాపురం వీధికి చేరుకున్నారు. మొబైల్ద్వారా క్రికెట్ బెట్టింగ్ కడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల సెల్ఫోన్లు పరిశీలించి బెట్టింగ్ కడుతున్నట్టు స్పష్టం కావడంతో ఆ ఫోన్లతో పాటు రూ.16,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. చెందిన తుమ్మల వెంకటేశులు (36), వలయత్తూరు హరిప్రసాద్ (40), జూజుగిరి పురుషోత్తమ (35), మాణిక్యం గుణశేఖర్ (38), బసిరెడ్డి మధుసూదన్రెడ్డి (38)పై కేసు నమోదుచేసి రిమాండ్కు పంపుతున్నట్టు సీఐ చెప్పారు. ఎవరైనా క్రికెట్ బెట్టింగులు కడుతున్నా, ఇతర జూదాలు ఆడుతున్నా తమకు సమాచారం అందించాలని సీఐ శివప్రసాద్రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.