కరోనా 80 వేలు
ABN , First Publish Date - 2020-10-29T08:23:35+05:30 IST
కరోనా కేసులు జిల్లాలో 80 వేలు దాటేశాయి.
తిరుపతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): కరోనా కేసులు జిల్లాలో 80 వేలు దాటేశాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచీ బుధవారం ఉదయం 9 గంటల వరకూ కొత్తగా 315 మందికి వైరస్ సోకినట్టు అధికార యంత్రాంగం నిర్ధారించడంతో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 80098కి చేరుకుంది. తాజా కేసుల్లో తిరుపతి నగరంలో 85, మదనపల్లెలో 42, చిత్తూరులో 35, పీలేరులో 16, పుత్తూరులో 12, పుంగనూరులో 11, పలమనేరులో 8, చంద్రగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి రూరల్ మండలాల్లో 6 వంతున, బంగారుపాళ్యం, కలికిరి, పూతలపట్టు, రామకుప్పం, వాల్మీకిపురం మండలాల్లో ఐదువంతున, గుడుపల్లె, కురబలకోట, నిండ్ర, పాకాల, పీటీఎం, సోమల మండలాల్లో 4 వంతున, కేవీపల్లె, కుప్పం, రేణిగుంట మండలాల్లో 3 వంతున, బి.కొత్తకోట, చిన్నగొట్టిగల్లు, గుడిపాల, నిమ్మనపల్లె, సత్యవేడు మండలాల్లో 2 చొప్పున, నగరి, చౌడేపల్లె, జీడీనెల్లూరు, గంగవరం, ఐరాల, కలకడ, ములకలచెరువు, పెద్దమండ్యం, పులిచెర్ల, రామచంద్రాపురం, రొంపిచెర్ల, ఎస్ఆర్పురం, తంబళ్ళపల్లె, తవణంపల్లె, వడమాలపేట, వరదయ్యపాళ్యం, వి.కోట, విజయపురం, యాదమరి, ఏర్పేడు మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి.వైరస్తో మరో ఇద్దరు మృతి చెందడంతో కొవిడ్ మృతుల సంఖ్య 774కు పెరిగింది.