ముగిసిన ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’

ABN , First Publish Date - 2020-10-30T11:46:39+05:30 IST

తిరుపతి అర్బన్‌జిల్లాలో రెండురోజులపాటు నిర్వహించిన ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’ కార్యక్రమం గురువారంతో ముగిసింది.

ముగిసిన ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’

 215 మంది పిల్లలు, వారి తల్లిదండ్రులకు పోలీసుల కౌన్సిలింగ్‌ 


తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 29: తిరుపతి అర్బన్‌జిల్లాలో రెండురోజులపాటు నిర్వహించిన ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’ కార్యక్రమం గురువారంతో ముగిసింది. వ్యాపారాలు, వ్యవసాయం, ఇతర పనుల్లో తల్లిదండ్రులకు సాయపడుతూ చదువు మానేసిన పిల్లలు, తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా వీధిబాలలుగా మారిన 215 మందిని ఈ రెండు రోజుల్లో గుర్తించారు. బాలలకు చదువు ప్రాముఖ్యతను వివరిస్తూ పాఠశాలలకు వెళ్లాలని సూచించారు. పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలకు పంపించాలని వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. 

Updated Date - 2020-10-30T11:46:39+05:30 IST