ట్రాక్టర్‌ బోల్తా - ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-12-03T06:23:14+05:30 IST

మండలంలోని బూదగవి సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్గన్న (45) మృతి చెందాడు.

ట్రాక్టర్‌ బోల్తా - ఒకరి మృతి

ఉరవకొండ, డిసెంబరు 2: మండలంలోని బూదగవి సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్గన్న (45) మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివ రాలివి. బొమ్మనహాళ్‌ మండలం కల్వల్‌తిప్ప గ్రామానికి చెందిన దుర్గన్న కొట్టాలపల్లి నుంచి ట్రాక్టర్‌లో సిమెంట్‌ బస్తాలు వేసుకుని స్వగ్రామానికి వెళ్తున్నాడు. బూదగవి సమీపంలో ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తా పడి అక్కడిక క్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం ని మిత్తం ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పో లీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


కర్ణాటక రోడ్డు ప్రమాదంలో శ్రీమజ్జినపల్లి వాసి..

కుందుర్పి, డిసెంబరు2:మం డలంలోని శ్రీమజ్జినపల్లికి చెందిన మారుతి (19) గురువారం కర్ణాట కలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు తెలిపి న వివరాలివి. గ్రామానికి చెందిన మారుతి, మంజునాథ్‌ కలిసి వ్యక్తిగ త పనుల నిమిత్తం ద్విచక్రవాహనంలో కర్ణాటక ప్రాంతమైన శిర  వద్ద వెళుతున్నారు. డివైడర్‌ను ఢీకొని కిందపడి మారుతి అక్కడికక్కడే మృతి చెందాడు. మంజునాథ్‌ గాయపడగా శిర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనతో మారుతి కుటుంబీకులు బోరున విలపించారు.




Updated Date - 2021-12-03T06:23:14+05:30 IST