ఇద్దరి ఉసురు తీసిన ట్రాక్టరు టైరు
ABN , First Publish Date - 2021-03-01T09:30:21+05:30 IST
మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేమనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం కొమనాపల్లి
పంక్చరు వేస్తుండగా పేలిపోయిన వైనం
జలుమూరు, ఫిబ్రవరి 28: మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేమనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం కొమనాపల్లి జంక్షన్లో ఆదివారం రాత్రి జరిగిందీ విషాద ఘటన. జలుమూరు పోలీసుల కథనం మేరకు.. కొమనాపల్లికి చెందిన దాసరి సూర్యనారాయణ (52) సైకిల్ షాపు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి అదే మండలం తిమడాం గ్రామానికి చెందిన బొమ్మాళి గోవింద (45) ట్రాక్టరు టైరు పంక్చరు వేయించేందుకు వచ్చాడు. పంక్చరు వేసి గాలి నింపుతుండగా టైరు పేలడంతో సూర్యనారాయణ డిస్కుతో సహా ఎగిరి పైనున్న విద్యుత్ వైర్లకు తగిలి కిందకు పడిపోయి అక్కడే మృతిచెందాడు. గోవింద ముఖంపై తీవ్రగాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు.