ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని ఒకరి దుర్మరణం
ABN , First Publish Date - 2022-06-27T06:39:20+05:30 IST
రోడ్డు పై నిలిపి ఉన్న వాహనాన్ని బైక్ ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందారు.
మృతుడు నిడమనూరు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్
పెద్దవూర, జూన 26: రోడ్డు పై నిలిపి ఉన్న వాహనాన్ని బైక్ ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమా దం పెద్దవూర మండలం తిప్పలమడుగు స్టే జీ వద్ద ఆదివారం రాత్రి జరిగింది. ఎస్ఐ పరమే ష్ తెలిపిన వివరాల ప్ర కా రం.... హాలియాలో నివాసముంటున్న సయ్యద్ సయీద్ (46) నిడమనూరు సబ్ రిజిస్ర్టార్ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసేవాడు. ఆదివారం హాలియా నుంచి ద్విచక్ర వాహనంపై పెద్దవూర వైపు వెళ్తున్నాడు. మార్గమధ్యలో తె ప్పలమడుగు స్టేజీ సమీపంలోకి రాగానే రోడ్డుపై నిలిపి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని సయ్యద్ సయీద్ వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో సయ్యద్ సయీద్ తలకు తీవ్రగాయలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని నాగార్జునసాగర్ కమలానెహ్రూ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడు సయీద్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.