ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

ABN , First Publish Date - 2021-01-22T05:54:32+05:30 IST

ట్రాఫిక్‌ నిబంధనలను పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నియమాలు పాటించాలని డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ రాజారత్నం తెలిపారు.

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి
సమావేశంలో మాట్లాడుతున్న రాజారత్నం

మల్కాపురం జనవరి 21 : ట్రాఫిక్‌ నిబంధనలను పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నియమాలు పాటించాలని డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ రాజారత్నం తెలిపారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా గురువారం నేవల్‌ డాక్‌యార్డు సమీపంలోని విశాఖపట్నం లారీ ఆపరేటర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో లారీ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనాలు మొదటి స్థానంలో, లారీలు రెండో స్థానంలో, ఆటోలు మూడో స్థానంలో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌టీవో ఆర్‌సీహెచ్‌ శ్రీనివాసరావు, అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు కె.అర్జున్‌రావు,  కార్యదర్శి లక్ష్మీనారాయణ, కార్యదర్శి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-22T05:54:32+05:30 IST