నేరేడుగొమ్ములో అలుముకున్న విషాదం

ABN , First Publish Date - 2020-10-27T11:35:50+05:30 IST

మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి విషాదం నుంచి తేరుకోకముందే నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ములో మరో విషాదం అలుముకుంది.

నేరేడుగొమ్ములో అలుముకున్న విషాదం

 నాయిని నర్సింహారెడ్డి సతీమణి మృతి  భర్త మృతిచెందిన ఐదు రోజులకే ఘటన


దేవరకొండ, అక్టోబరు 26 : మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి విషాదం నుంచి తేరుకోకముందే నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ములో మరో విషాదం అలుముకుంది. భర్త మృతిచెందిన ఐదు రోజులకే ఆయన భార్య అహల్య(70) అనారోగ్యంతో సోమవారం మృతిచెందారు. ఉమ్మడి చందంపేట మండలం పెద్దమునిగల్‌లో అనంతరెడ్డి-లక్ష్మీ దంపతులకు జన్మించిన ఆమె ఇక్కడే చదువుకుని, సమీప మండలమైన నేరేడుగొమ్ముకు చెందిన నాయిని నర్సింహారెడ్డిని 1962లో వివాహం చేసుకున్నారు. రైతు కుటుంబం నుంచి రావటంతో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేవారు. భర్త నాయిని నర్సింహారెడ్డికి చేదోడువాదోడుగా నిలిచారు. అహల్య మృతితోస్వగ్రామమైన పెద్దమునిగల్‌లో, నేరేడుగొమ్ములో అభిమానులు, టీఆర్‌ఎస్‌ నేతలు ఆమె చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నర్సింహారెడ్డి, అహల్య దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. అహల్య మృతిపట్ల ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌, ఆరెకంటి రాములు, బీవీ.రామారావుతో పాటు సన్నిహితులు సంతాపం తెలిపారు. 

Updated Date - 2020-10-27T11:35:50+05:30 IST