కృష్ణానగర్లో విషాదం
ABN , First Publish Date - 2022-03-02T22:56:41+05:30 IST
నగరంలోని కృష్ణానగర్లో విషాదం జరిగింది. సాయికృప స్కూల్లో
హైదరాబాద్: నగరంలోని కృష్ణానగర్లో విషాదం జరిగింది. సాయికృప స్కూల్లో ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వాటర్ బాటిల్స్తో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో మన్సూర్కు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మన్సూర్ మృతి చెందాడు. సాయికృప స్కూల్లో ఈ విద్యార్థులు 6వ తరగతి చదువుతున్నారు. ఘటనపై బాధిత విద్యార్థి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.