ముదక్‌పల్లిలో విషాదం

ABN , First Publish Date - 2021-04-18T06:08:33+05:30 IST

మోపాల్‌ మండలం ముదక్‌పల్లికి చెందిన కిష్టాగౌడ్‌ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన కిష్టాగౌడ్‌ (30), హరీష్‌గౌడ్‌, ప్రవీణ్‌గౌడ్‌లు సిద్దిపేట జిల్లా కొమురవెల్లి దేవస్థానానికి వెళ్లి దర్శనం చేసుకుని తిరిగివస్తున్నారు.

ముదక్‌పల్లిలో విషాదం

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

మోపాల్‌, ఏప్రిల్‌ 17: మోపాల్‌ మండలం ముదక్‌పల్లికి చెందిన కిష్టాగౌడ్‌ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన కిష్టాగౌడ్‌ (30), హరీష్‌గౌడ్‌, ప్రవీణ్‌గౌడ్‌లు సిద్దిపేట జిల్లా కొమురవెల్లి దేవస్థానానికి వెళ్లి దర్శనం చేసుకుని తిరిగివస్తున్నారు. శుక్రవారం రాత్రి కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామ శివారులో కారులో తిరిగి వస్తుండగా చెట్టుకు ఢీకొనడంతో కిష్టాగౌడ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. హరీష్‌గౌడ్‌, ప్రవీణ్‌గౌడ్‌లు తీవ్రంగా గాయపడడంతో వారిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కి ష్టాగౌడ్‌కు గత ఏడాది క్రితమే వివాహం జరిగింది. ఈ ముగ్గురు ప్రాణస్నేహితులుగా ఉండేవారని గ్రామస్థులు తెలిపారు. 

Updated Date - 2021-04-18T06:08:33+05:30 IST