ఈ ఏడాది 4,275 బోగీల నిర్మాణమే లక్ష్యం: ఐసీఎఫ్
ABN , First Publish Date - 2022-04-21T18:36:29+05:30 IST
ఈ ఏడాది 4,275 రైలు బోగీలు తయారుచేయాలని ఐసిఎఫ్ లక్ష్యంగా నిర్ధేశించింది. భారత రైల్వేకు అవసరమైన రైలుపెట్టెలను తయారుచేయడంలో పెరంబూర్లోని
ఐసిఎఫ్(చెన్నై): ఈ ఏడాది 4,275 రైలు బోగీలు తయారుచేయాలని ఐసిఎఫ్ లక్ష్యంగా నిర్ధేశించింది. భారత రైల్వేకు అవసరమైన రైలుపెట్టెలను తయారుచేయడంలో పెరంబూర్లోని రైలు పెట్టెల తయారీ కర్మాగారం ఐసీఎఫ్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్యాసింజర్, పర్యాటక, సైనికుల రైలు బోగీలు ఇలా 50 రకాల్లో 600 డిజైన్లతో తయారుచేస్తోంది. గత ఆర్ధిక సంవత్సరం 3 వేల రైలుపెట్టెలు తయారుచేసిన ఐసిఎఫ్ ఈ ఆర్ధిక సంవత్సరం 4,275 బోగీలు తయారుచేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇందులో 50 శాతం ఎల్హెచ్బీ బోగీలుంటాయని, సబర్బన్, వందే భారత్ సూపర్ ఫాస్ట్, పర్యాటక రైళ్ల బోగీలు కూడా తయారుచేయనున్నట్లు అధికారులు తెలిపారు.