రైలు ఢీకొని యువకుడి దుర్మరణం
ABN , First Publish Date - 2020-09-29T08:12:25+05:30 IST
రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం కడియాలకుంట శివారులో సోమవారం ఉదయం రైలింజన్ ఢీకొనడంతో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కడియాలకుంట పంచాయతీ పరిధి బూర్జుగడ్డతండాకు
షాద్నగర్ రూరల్, సెప్టెంబరు 28: రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం కడియాలకుంట శివారులో సోమవారం ఉదయం రైలింజన్ ఢీకొనడంతో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కడియాలకుంట పంచాయతీ పరిధి బూర్జుగడ్డతండాకు చెందిన సభావత్ రాంసింగ్(26) తండా శివారులో ఉన్న తమ పొలం సమీపంలోని రైలు పట్టాలపై కూర్చుని చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటున్నాడు. కొత్తగా వేసిన లైన్పై రైలు రాదన్న ధీమాతో కూర్చున్నాడు. అయితే ట్రాక్ పనుల్లో ఉన్న రైలు ఇంజన్ అదే లైన్పై వచ్చి ఆ యువకుడిని ఢీకొట్టడంతో మృతి చెందాడు.