రైళ్ల రాకపోకలు యథాతథం
ABN , First Publish Date - 2022-08-20T05:06:32+05:30 IST
గుంతకల్లు- తిరుపతి మార్గంలో శనివారం నుంచి రైళ్ల రాకపోకలు యథావిధిగా సాగనున్నట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని అనంతపురం జిల్లా తాటిచెర్ల - జంగాలపల్లె మార్గంలో జరుగుతున్న రైల్వే లైను డబ్లింగ్ పనుల కారణంగా వారం రోజులుగా పలు రైళ్లను రైల్వే శాఖ దారి మళ్లించిన విషయం విధితమే.
తాటిచెర్ల - జంగాలపల్లె మార్గంలో పనులు పూర్తి
ములకలచెరువు, ఆగస్టు 19: గుంతకల్లు- తిరుపతి మార్గంలో శనివారం నుంచి రైళ్ల రాకపోకలు యథావిధిగా సాగనున్నట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని అనంతపురం జిల్లా తాటిచెర్ల - జంగాలపల్లె మార్గంలో జరుగుతున్న రైల్వే లైను డబ్లింగ్ పనుల కారణంగా వారం రోజులుగా పలు రైళ్లను రైల్వే శాఖ దారి మళ్లించిన విషయం విధితమే. గుంతకల్లు నుంచి ములకలచెరువు, బి.కొత్తకోట మండలం తుమ్మనంగుట్ట, కురబలకోట, మదనపల్లెరోడ్, వాయిల్పాడు, కలికిరి, పీలేరు మీదుగా తిరుపతికి వేళ్లే ఎనిమిది రైళ్లను దారి మళ్లించారు. కాగా పనులు పూర్తి కావడంతో వీటిని యథాతథంగా నడపనున్నట్లు వారు తెలిపారు.