యనమదుర్రు కొత్త వంతెనపై రైలు ట్రయల్‌ రన్‌

ABN , First Publish Date - 2022-01-29T06:05:45+05:30 IST

పట్టణంలోని టౌన్‌ రైల్వే స్టేషన్‌ దగ్గరలోని యనమదుర్రు డ్రెయిన్‌పై నిర్మించిన రైలు వంతెనపై శుక్రవారం ట్రయిల్‌ రన్‌ ను నిర్వహించారు. రైల్వే డీజీఎం వేమారెడ్డి ఈ ట్రయిల్‌ రన్‌ను ప్రారంభించారు.

యనమదుర్రు కొత్త వంతెనపై రైలు ట్రయల్‌ రన్‌

భీమవరం క్రైం, జనవరి 28 : పట్టణంలోని టౌన్‌ రైల్వే స్టేషన్‌ దగ్గరలోని యనమదుర్రు డ్రెయిన్‌పై నిర్మించిన రైలు వంతెనపై శుక్రవారం ట్రయిల్‌ రన్‌ ను నిర్వహించారు. రైల్వే డీజీఎం వేమారెడ్డి ఈ ట్రయిల్‌ రన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా నిర్మించిన వంతెనపై ట్ర యిల్‌ రన్‌ను నిర్వహిస్తామని, త్వరలోనే డబ్లింగ్‌ రైల్వే లైను పూర్తి కావొస్తున్నాయన్నారు. రెండు ఇంజన్లు, ఆరు లోడ్‌ వ్యాగన్లు, ఒక బ్రేక్‌ వ్యాన్‌తో ట్రయిల్‌ నిర్వహించారు. కార్యక్రమంలో టీఈ దివాకర్‌, బ్రిడ్జి కాంట్రాక్టర్‌ సుబ్బారెడ్డి, ఆర్‌ఐ రమేష్‌, ట్రాక్‌ ఇన్‌చార్జి శివరామ, నరసాపురం ఎస్‌ఎం మధుబాబు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-29T06:05:45+05:30 IST