Breaking News: మధ్యప్రదేశ్‌లో కూలిన శిక్షణ విమానం..!

ABN , First Publish Date - 2021-07-17T23:10:50+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఓ శిక్షణ విమానం కుప్పకూలింది. శనివారం మధ్యాహ్నం జాతీయ రహదారిపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

Breaking News: మధ్యప్రదేశ్‌లో కూలిన శిక్షణ విమానం..!

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఓ శిక్షణ విమానం కుప్పకూలింది. శనివారం మధ్యాహ్నం  రహదారిపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే..ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ట్రైనర్, శిక్షణలో ఉన్న  పైలట్‌ ఇద్దరూ క్షేమంగానే ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తాజాగా స్పందించారు.  ‘‘సెస్నా మోడల్ విమానం క్రాష్ అయినట్టు ఇప్పుడే తెలిసింది. ఈ విమానం సాగర్‌లోని చైమ్స్ ఏవియేషన్ అకాడమీకి చెందినది. అదృష్టవశాత్తూ..శిక్షణలో ఉన్న ట్రైనీ పైలట్‌కు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఘటనా స్థలానికి దర్యాప్తు బృందాలను పంపించాం’’ అని ఆయన పేర్కొన్నారు. ఆయన ట్వీట్ చేసిన కాసేపటికీ..విమానంలో ఉన్న ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. 

Updated Date - 2021-07-17T23:10:50+05:30 IST