జాతీయస్థాయి హాకీ పోటీలకు శిక్షణ

ABN , First Publish Date - 2021-03-01T06:23:06+05:30 IST

పట్టణంలోని రాజీవ్‌ గాంధీ క్రీడా మైదానంలో ఆదివారం జాతీయ హాకీ క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభమైంది.

జాతీయస్థాయి హాకీ పోటీలకు శిక్షణ
శిక్షణ శిబిరానికి హాజరైన హాకీ క్రీడాకారిణులు

   13 జిల్లాల నుంచి క్రీడాకారిణులు హాజరు

 వారం రోజుల పాటు ఎలమంచిలిలో నిర్వహణ

ఎలమంచిలి, ఫిబ్రవరి 28 : పట్టణంలోని రాజీవ్‌ గాంధీ క్రీడా మైదానంలో ఆదివారం జాతీయ హాకీ క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభమైంది. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన క్రీడాకారిణిలు హాజరయ్యారు. ఎలమంచిలి హాకీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ఈ శిబిరం కొనసాగనుంది. కోచ్‌లుగా కర్నూల్‌, కడప జిల్లాలకు చెందిన వారిని నియమించారు  ఈ కార్యక్రమంలో మండాడి శ్రీనివాస్‌, ఎంఎల్‌ఏఎస్‌ కళాశాల కరస్పాండెంట్‌ ఎం.లక్ష్మయ్య. కె.సాయిరాం, వైహెచ్‌ఏ ప్రతినిధులు గోపి, నరేష్‌, జీవీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T06:23:06+05:30 IST