జాతీయస్థాయి హాకీ పోటీలకు శిక్షణ
ABN , First Publish Date - 2021-03-01T06:23:06+05:30 IST
పట్టణంలోని రాజీవ్ గాంధీ క్రీడా మైదానంలో ఆదివారం జాతీయ హాకీ క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభమైంది.
13 జిల్లాల నుంచి క్రీడాకారిణులు హాజరు
వారం రోజుల పాటు ఎలమంచిలిలో నిర్వహణ
ఎలమంచిలి, ఫిబ్రవరి 28 : పట్టణంలోని రాజీవ్ గాంధీ క్రీడా మైదానంలో ఆదివారం జాతీయ హాకీ క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభమైంది. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన క్రీడాకారిణిలు హాజరయ్యారు. ఎలమంచిలి హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ఈ శిబిరం కొనసాగనుంది. కోచ్లుగా కర్నూల్, కడప జిల్లాలకు చెందిన వారిని నియమించారు ఈ కార్యక్రమంలో మండాడి శ్రీనివాస్, ఎంఎల్ఏఎస్ కళాశాల కరస్పాండెంట్ ఎం.లక్ష్మయ్య. కె.సాయిరాం, వైహెచ్ఏ ప్రతినిధులు గోపి, నరేష్, జీవీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.