జనవరి ఒకటి వరకు ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2020-12-04T04:41:58+05:30 IST

ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ మీదుగా రాకపోకలు సాగిస్తున్న పలు ప్రత్యేక రైళ్ల సర్వీసులను జనవరి ఒకటి వరకు పొడిగిస్తున్నట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే.త్రిపాఠి తెలిపారు.

జనవరి ఒకటి వరకు ప్రత్యేక రైళ్లు

విశాఖపట్నం, డిసెంబరు 3: ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ మీదుగా రాకపోకలు సాగిస్తున్న పలు ప్రత్యేక రైళ్ల సర్వీసులను జనవరి ఒకటి వరకు పొడిగిస్తున్నట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే.త్రిపాఠి తెలిపారు. హటియా-యశ్వంత్‌పూర్‌-హటియా (02835/02836) ఎక్స్‌ప్రెస్‌లను జనవరి ఒకటి వరకు, టాటానగర్‌-యశ్వంత్‌పూర్‌-టాటానగర్‌ (02889/02890) సర్వీసులను డిసెంబరు 28వ తేదీ వరకు, హౌరా-యశ్వంత్‌పూర్‌-హౌరా (02873/02874) ఎక్స్‌ప్రెస్‌లను జనవరి ఒకటి వరకు, హౌరా-ఎర్నాకులం-హౌరా (02877/02878) రైళ్లను డిసెంబరు 29వ తేదీ వరకు, హౌరా-పాండిచ్చేరి-హౌరా (02867/02868) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను డిసెంబరు 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు.


Updated Date - 2020-12-04T04:41:58+05:30 IST