పలు రైళ్ల రద్దు
ABN , First Publish Date - 2022-09-23T05:32:34+05:30 IST
చెన్నై నుంచి సూళ్లూరుపేటకు వచ్చే లోక్ మెమో రైళ్లు ఈ నెల 23, 27, 30తేదీలలో పూర్తిగా రద్దు చేసినట్లు రైల్వే అధి కారులు తెలిపారు.
సూళ్లూరుపేట, సెప్టెంబరు 22 : చెన్నై నుంచి సూళ్లూరుపేటకు వచ్చే లోక్ మెమో రైళ్లు ఈ నెల 23, 27, 30తేదీలలో పూర్తిగా రద్దు చేసినట్లు రైల్వే అధి కారులు తెలిపారు. సూళ్లూరుపేట - తడ మధ్యలో రైల్వే ట్రాక్ మరమ్మతుల నిమిత్తం ఈ మెమో రైళ్లను రద్దుచేసినట్లు వారు పేర్కొన్నారు. అదే విధంగా ఈనెల 27న విజయవాడ నుంచి చెన్నైకు వెళ్లే విజయవాడ ఎక్స్ప్రెస్ను గూడూరు వరకే నడపనున్నట్లు తెలిపారు. అదే విధంగా గూడూరు నుంచి చెన్నైకు వెళ్లే పలు ఎక్స్ప్రెస్లను ఈనెల 27న గూడూరు నుంచి రేణిగుంట, అరక్కోణం మీదుగా చెన్నైకు పంపనున్నట్లు వారు తెలిపారు.