పలు రైళ్ల దారి మళ్లింపు

ABN , First Publish Date - 2022-06-30T14:07:20+05:30 IST

విరంగన లక్ష్మిబాయ్‌, కాన్పూర్‌ సెక్షన్లలో మరమ్మతు చేపట్టనున్న కారణంగా చెన్నై మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను దారి మళ్లించినట్లు

పలు రైళ్ల దారి మళ్లింపు

చెన్నై, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): విరంగన లక్ష్మిబాయ్‌, కాన్పూర్‌ సెక్షన్లలో మరమ్మతు చేపట్టనున్న కారణంగా చెన్నై మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను దారి మళ్లించినట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. అలాగే చెన్నై బీచ్‌ - తాంబరం స్టేషన్ల మధ్య ఈ నెల 30, జూలై 2, 4 తేదీల్లో రాత్రిపూట పలు రైళ్లను రద్దు చేశారు. ఆ మేరకు దక్షిణ రైల్వే ప్రకటన విడుదల చేసింది. - జూలై 9, 12 తేదీల్లో ఉదయం 5.15 గంటలకు బయలుదేరే చెన్నై సెంట్రల్‌ - లక్నో బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (16093) విరంగన లక్ష్మిబాయ్‌, గ్వాలియర్‌, ఆగ్రా కంటోన్మెంట్‌, తుండ్ల, ఎటవాహ్‌, కాన్పూర్‌ మీదుగా వెళ్తుంది. - జూలై 11, 14 తేదీల్లో సాయంత్రం 4.20 గంటలకు బయలుదేరే లక్నో - చెన్నై సెంట్రల్‌ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (16094) కాన్పూర్‌, ఎటవాహ్‌, తుంట్ల, ఆగ్రా కంటోన్మెంట్‌, గ్వాలియర్‌, విరంగన లక్ష్మిబాయ్‌ స్టేషన్ల మీదుగా రానుంది. - జూలై 1, 3, 7, 8, 10, 14 తేదీల్లో ఉదయం 6.35 గంటలకు బయలుదేరే గోరఖ్‌పూర్‌ - కొచ్చువేలి రప్తిసాగర్‌ ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (12511) కాన్పూర్‌, ఎటవాహ్‌, తుంట్ల, ఆగ్రా కంటోన్మెంట్‌, గ్వాలియర్‌, విరంగన లక్ష్మిబాయ్‌ స్టేషన్ల మీదుగా రానుంది. - జూలై 4, 11 తేదీల్లో రాత్రి 10.51 గంటలకు బయలుదేరే బరౌనీ - ఎర్నాకులం జంక్షన్‌ రప్తిసాగర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (12521)కాన్పూర్‌, ఎటవాహ్‌, తుంట్ల, ఆగ్రా కంటోన్మెంట్‌, గ్వాలియర్‌, విరంగన లక్ష్మిబాయ్‌ స్టేషన్ల మీదుగా రానుంది. - జూలై 2, 9 తేదీల్లో ఉదయం 8.30 గంటలకు బయలుదేరే గోరఖ్‌పూర్‌ - ఎర్నాకులం జంక్షన్‌ వీక్లీ స్పెషల్‌ (05303) కాన్పూర్‌, ఎటవాహ్‌, బింద్‌, గ్వాలియర్‌, విరంగన లక్ష్మీబాయ్‌ స్టేషన్ల మీదుగా రానుంది. 

Updated Date - 2022-06-30T14:07:20+05:30 IST