వికారాబాద్ అదనపు కలెక్టర్ మోతీలాల్ బదిలీ
ABN , First Publish Date - 2022-05-21T05:30:00+05:30 IST
వికారాబాద్ అదనపు కలెక్టర్ మోతీలాల్ బదిలీ
వికారాబాద్, మే 21(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ ఎస్.మోతీలాల్ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2018, సెప్టెంబరు 27న డీఆర్వోగా జిల్లాకు వచ్చిన మోతీలాల్ 2 బీహెచ్కే నోడల్ అధికారి, డీఎండబ్ల్యువో, డీపీవో, వికారాబాద్ ఆర్డీవోగా ఇన్చార్జి బాధ్యతలు నిర్వహించారు. 2020, ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఆయన జిల్లాలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా కొనసాగుతూ వచ్చారు. జిల్లాలో ఎన్నికలు సజావుగా కొనసాగడంలో ఆయన ఎంతో కీలక పాత్ర పోషించారు. కరోనా కేసులు నమోదైన తొలిరోజుల్లో అనంతగిరి హరితరిసార్ట్స్లో సెంటర్ ఏర్పాటు చేసి సజావుగా కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో ఽలక్ష్యం మేరకు ధాన్యం కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకున్నారు. ప్రజలు, బాధితుల ముందే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేసేవారనే గుర్తింపు ప్రజల్లో ఉంది. జిల్లా అదనపు కలెక్టర్గా మోతీలాల్ స్థానంలో ప్రభుత్వం ఇంకా ఎవరినీ నియమించలేదు.