ఇద్దరు జొన్నవాడ ఆలయ ఉద్యోగుల బదిలీ
ABN , First Publish Date - 2022-07-02T04:53:29+05:30 IST
మండలంలోని జొన్నవాడ శ్రీమల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయంలోని ఇద్దరు ఉద్యోగులు జిల్లాలోని రెండు ఆలయాలకు బదిలీ అయ్యారు.
బుచ్చిరెడ్డిపాళెం, జూలై1: మండలంలోని జొన్నవాడ శ్రీమల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయంలోని ఇద్దరు ఉద్యోగులు జిల్లాలోని రెండు ఆలయాలకు బదిలీ అయ్యారు. జొన్నవాడ ఆలయంలో జూనియర్ అసిస్టెంట్లు హోదాలో అన్నదానంలో విధులు నిర్వహించే పి.శ్రీనివాసులును పెంచలకోనకు, కే. మురళీకృష్ణను నెల్లూరు మూలాపేటలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయానికి బదిలీ చేస్తూ దేవదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వేణుగోపాలస్వామి ఆలయంలోని ఒక ఉద్యోగిని, పెంచలకోన ఆలయ నుంచి మరొక ఉద్యోగిని జొన్నవాడ ఆలయానికి బదిలీ చేస్తూ రాష్ట్ర దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏళ్ల తరబడి ఒకే ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారనే కారణంపై ఈ బదిలీలు చేసినట్టు తెలిసింది. ఇక్కడ నుంచి మరో ఇద్దరి బదిలీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.