పారదర్శకంగా బదిలీలు : ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌

ABN , First Publish Date - 2022-05-20T06:38:20+05:30 IST

జిల్లాలో పోలీస్‌శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ విధులు నిర్వర్తించే 55 మందికి హెడ్‌ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించి పార దర్శకంగా బదిలీలు నిర్వహించామని ఎస్పీ సిహెచ్‌. ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

పారదర్శకంగా బదిలీలు : ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌
పదోన్నతి పొందిన కానిస్టేబుళ్లతో ఎస్పీ

నిర్మల్‌ కల్చరల్‌, మే 19 : జిల్లాలో పోలీస్‌శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ విధులు నిర్వర్తించే 55 మందికి హెడ్‌ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించి పార దర్శకంగా బదిలీలు నిర్వహించామని ఎస్పీ సిహెచ్‌. ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. గురువారం పోలీస్‌ కార్యాలయంలో కౌన్సిలింగ్‌ నిర్వహించారు. విధి నిర్వహ ణలో మంచిపేరు గాంచాలని పిలుపునిచ్చారు. నీతి, నిజాయితీగా అధికారులతో కలిసిమెలిసి పని చేయాలని సూచించారు. పోలీసుశాఖలో పని చేసేవారు ప్రతి ఒక్కరు అధునాతన సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలన్నారు. ఒత్తిడి లేకుండా పనిచేయాలంటే యోగ, వ్యాయామం ప్రతిరోజు చేసి మంచి ఆహా రపు అలవాట్లు కలిగి ఉండాలన్నారు. అదనపు ఎస్పీ రామ్‌రెడ్డి, డీఎస్పీలు జీవన్‌ రెడ్డి, ఇతర ఇన్స్‌పెక్టర్లు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-20T06:38:20+05:30 IST