ట్రావెల్స్ బస్సు బోల్తా
ABN , First Publish Date - 2022-08-18T06:29:24+05:30 IST
ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో పలువురికి ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఎస్ఐ అయ్యప్పరెడ్డి అందించిన వివరాల ప్రకారం.. ఆరెంజ్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి మంగళవారం 30 మంది ప్రయాణికులతో రాజమహేంద్రవరం బయలుదేరింది.
ముగ్గురికి తీవ్రగాయాలు
15 మందికి స్వల్పగాయాలు
నల్లజర్ల,
ఆగస్టు 17: ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో పలువురికి ప్రయాణికులకు
గాయాలయ్యాయి. ఎస్ఐ అయ్యప్పరెడ్డి అందించిన వివరాల ప్రకారం.. ఆరెంజ్
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి మంగళవారం 30 మంది
ప్రయాణికులతో రాజమహేంద్రవరం బయలుదేరింది. నల్లజర్ల ప్రియాంకా ఫంక్షన్
హాల్ వద్దకు వచ్చేసరికి ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే
క్రమంలో అతివేగం వల్ల అదుపు తప్పి బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న
15మందికి స్వల్ప గాయాలు కాగా, ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఏలూరులోని
ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ అయ్యప్పరెడ్డి తన సిబ్బందితో
చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వారి లగేజీని భద్రపర్చి వారి
బంధువులకు అప్పగించారు. బోల్తా పడిన బస్సును క్రేన్ సహాయంతో తొలగించి వాహన
రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు
ఎస్ఐ అయ్యప్పరెడ్డి తెలిపారు.