పిడుగుపడి కొబ్బరి చెట్టు దగ్ధం
ABN , First Publish Date - 2021-04-24T05:03:26+05:30 IST
సోమల మండలంలో శుక్రవారం ఓ మోస్తారు వర్షం కురిసింది.
సోమల, ఏప్రిల్ 23: సోమల మండలంలో శుక్రవారం ఓ మోస్తారు వర్షం కురిసింది. పొదలకుంటపల్లెలో సాయంత్రం 4గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఎంపీటీసీ నాగభూషణంరెడ్డి ఇంటి సమీపంలోని కొబ్బరి చెట్టుపై పిడుగుపడి దగ్ధ మైంది. వర్షంతో రెండు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో ట్రాన్స్కో ఎఈ రాంప్రసాద్రెడ్డి, లైన్మన్ సుబ్రహ్మణ్యం, నవీన్ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.