మన్యం గజగజ

ABN , First Publish Date - 2022-01-22T06:15:36+05:30 IST

మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి.

మన్యం గజగజ
లంబసింగిలో కురుస్తున్న మంచు

మరింత తగ్గిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు 

చింతపల్లిలో 6 డిగ్రీలు నమోదు

చింతపల్లి, జనవరి 21: మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. శీతలగాలులు వీస్తుండడం, మంచు దట్టంగా కురుస్తుండడంతో చలి తీవ్రత పెరిగి జనం గజగజ వణికిపోతున్నారు. శుక్రవారం చింతపల్లిలో 6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఏడీఆర్‌ డాక్టర్‌ ఎం.భరతలక్ష్మి తెలిపారు. సాధారణంగా ఏజెన్సీలో డిసెంబరు నుంచి జనవరి రెండో వారం వరకు ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయిలో నమోదవుతుంటాయి. కానీ ఈసారి జనవరి మూడో వారం దాటుతున్నా చలి తీవ్రత తగ్గకపోగా మరింత పెరిగింది. సంక్రాంతి తరువాత కనిష్ఠ ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే తక్కువ నమోదు కావడం చాలా అరుదని ఏడీఆర్‌ తెలిపారు. 

Updated Date - 2022-01-22T06:15:36+05:30 IST