దారుణం: మహిళను నడిరోడ్డుపై నిలబెట్టి, నగ్నంగా మార్చి వీడియో తీశారు.. చివరకు..

ABN , First Publish Date - 2022-04-25T17:39:44+05:30 IST

ఆ గిరిజన మహిళ తన కుటుంబంతో కలిసి ప్రభుత్వ భూమిలో నివాసం ఏర్పాటు చేసుకుంది..

దారుణం: మహిళను నడిరోడ్డుపై నిలబెట్టి, నగ్నంగా మార్చి వీడియో తీశారు.. చివరకు..

ఆ గిరిజన మహిళ తన కుటుంబంతో కలిసి ప్రభుత్వ భూమిలో నివాసం ఏర్పాటు చేసుకుంది.. చాలా ఏళ్లుగా అక్కడే నివసిస్తోంది.. కర్ణాటక ల్యాండ్ రెవెన్యూ యాక్ట్, 1964 ప్రకారం తమ స్థలాన్ని రెగ్యులరైజ్ చేయాలని దరఖాస్తు చేసుకుంది.. దాంతో గ్రామస్థులు ఆమెపై భగ్గుమన్నారు.. భూమిని ఆమెకు స్వాధీనం చేసేందుకు వీల్లేదని ధర్నాకు దిగారు.. భూమి కొలవడానికి వచ్చిన రెవెన్యూ సిబ్బందిని పంపేశారు.. అనంతరం బాధితురాలిపై దాడికి తెగబడ్డారు.


కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బెల్తన్ గడీ తాలుకాలోని ఓ గ్రామంలో ఈ నెల 19వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ భూ వివాదం విషయంలో 35 ఏళ్ల బాధిత మహిళను కొందరు గ్రామస్థులు తీవ్రంగా అవమానించారు. బాధిత మహిళను నడిరోడ్డుపై నిలబెట్టి తన దుస్తులు చింపారు. నగ్నంగా నిలబెట్టి వీడియో తీశారు. దీంతో ఆ మహిళ తనపై అఘాయిత్యానికి పాల్పడిన తొమ్మిది మందిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


మహిళ ఫిర్యాదు మేరకు తొమ్మిది మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితులు తనపైనే కాకుండా తన సోదరి, తల్లిపై కూడా దాడి చేశారని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులందరూ బాధితురాలి గ్రామానికి చెందిన వారేనని పోలీసులు తెలిపారు. 


Updated Date - 2022-04-25T17:39:44+05:30 IST