గిరిజనులకు గిరిజనబంధు ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-09-17T06:00:20+05:30 IST

గిరిజనులకు గిరిజనబంధు ఇవ్వాలి

గిరిజనులకు గిరిజనబంధు ఇవ్వాలి
నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేస్తున్న హరివర్ధన్‌రెడ్డి, జంగయ్యయాదవ్‌

మేడ్చల్‌ : తెలంగాణప్రదేశ్‌ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దళిత, గిరిజనులకు దళిత, గిరిజన బంధు అందజేయాలని దళిత, గిరిజన ఆత్మగౌరవ నిరసన దీక్షను గురువారం మేడ్చల్‌లో చేపట్టారు. పట్టణంలోని వివేకానంద చౌరస్తా వద్ద దీక్ష చేపట్టి అనంతరం తహసీల్దార్‌ కార్యాలయంలో కాంగ్రెస్‌ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహిళా నాయకురాళ్లకు  టీపీసీసీ సీనియర్‌ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ తోటకూర జంగయ్యయాదవ్‌ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. కార్యక్రమంలో సాబీర్‌అలీ, పోచయ్య, రమణారెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, రొయ్యపల్లి మల్లేశ్‌గౌడ్‌, శ్రీనివా్‌సయాదవ్‌, రాఘవేందర్‌గౌడ్‌, చేపరాజు, పానుగంటి మహేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-09-17T06:00:20+05:30 IST