434 మంది ఇమాం, మౌజన్లకు గౌరవవేతనం
ABN , First Publish Date - 2021-05-11T05:02:17+05:30 IST
వక్ఫ్బోర్డు సీఈఓ అలీంబాషా ఆదేశాల మేరకు జిల్లాలో 434 మంది ఇమాం, మౌజన్లకు గౌరవవేతనం చెల్లించాలని జిల్లా వక్ఫ్బోర్డు సూపరింటెండెంట్ ముక్తార్బాషా ఆదేశించారు.
జిల్లా వక్ఫ్బోర్డు సూపరింటెండెంట్ ముక్తార్బాషా
కడప(ఎర్రముక్కపల్లె), మే 10: వక్ఫ్బోర్డు సీఈఓ అలీంబాషా ఆదేశాల మేరకు జిల్లాలో 434 మంది ఇమాం, మౌజన్లకు గౌరవవేతనం చెల్లించాలని జిల్లా వక్ఫ్బోర్డు సూపరింటెండెంట్ ముక్తార్బాషా ఆదేశించారు. గౌరవేతనం చెల్లించి దానికి సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్, బ్యాంకు స్టేట్మెంటును జిల్లా వక్ఫ్బోర్డు కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఎవరైనా గౌరవవేతనం ఇవ్వకుండా ఇచ్చినట్లు యూసీ, బ్యాంకు స్టేట్మెంటు సమర్పిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.