ఆర్మీ జవాన్లకు సన్మానం
ABN , First Publish Date - 2021-01-16T05:12:40+05:30 IST
మండలం ఇందల్వాయి గ్రామంలో ఆర్మీడేను పురస్కరించుకొని గ్రామానికి చెందిన నితిన్రెడ్డి, గట్టు ప్రశాంత్, గొంగ వంశీకృష్ణ అనే ముగ్గురు ఆర్మీ జవాన్లను ముదిరాజ్ యంగ్స్టార్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఇందల్వాయి, జనవరి 15: మండలం ఇందల్వాయి గ్రామంలో ఆర్మీడేను పురస్కరించుకొని గ్రామానికి చెందిన నితిన్రెడ్డి, గట్టు ప్రశాంత్, గొంగ వంశీకృష్ణ అనే ముగ్గురు ఆర్మీ జవాన్లను ముదిరాజ్ యంగ్స్టార్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వీరిని ఆదర్శంగా తీసుకొని గ్రామం నుంచి మరింత మంది యువకులు దేవరక్షణలో పాలుపంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు గుర్రపు మోహన్, ఉపాధ్యక్షుడు లోకని గోపి, సతీష్పవార్, సుమన్, అనిల్, బాలు, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
బోధన్: జాతీయ సైనికుల దినోత్సవం సందర్భంగా బోధన్ పట్టణం అనిల్టాకీస్ రోడ్డులోని హనుమాన్ టెకిడీ ఆర్మీ జవాన్ను కాలనీవాసులు సన్మానించారు. కాలనీకి చెందిన శ్యాంసుందర్ ఠాకూర్ అనే ఆర్మీ జవాన్ను కాలనీవాసులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ధర్మపురి, కాలనీవాసులు పాల్గొన్నారు.