కవి కోకిలకు ఘన నివాళి

ABN , First Publish Date - 2021-07-25T05:28:17+05:30 IST

కవి కోకిల బిరుదు పొందిన గుర్రం జాషువా 50వ వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. జాషువా కవితాపీఠం ఆధ్వర్యంలో నగరంలోని శ్రీ వేంటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలోని జాషువా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

కవి కోకిలకు ఘన నివాళి
జాషువాకు నివాళి అర్పిస్తున్న అభిమానులు

కస్తూర్బా కళాక్షేత్రంలో జాషువా వర్ధంతి

నెల్లూరు (సాంస్కృతిక ప్రతినిధి), జూలై 24 : కవి కోకిల బిరుదు పొందిన గుర్రం జాషువా 50వ వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. జాషువా కవితాపీఠం ఆధ్వర్యంలో నగరంలోని శ్రీ వేంటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలోని జాషువా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కవితాపీఠం ప్రధాన కార్యదర్శి అవ్వారు శ్రీధర్‌బాబు మాట్లాడుతూ జాషువా రచనలను, సాహితీ సేవలను కొనియాడారు.  కోశాధికారి కొమ్మల కృష్ణయ్య ప్రసంగిస్తూ జాషువా తన రచనల ద్వారా ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని రగిల్చారన్నారు. కార్యక్రమంలో జాషువా ప్రజా గ్రంథాలయం కోశాధికారి పీజీడీ కృపాల్‌, కార్యదర్శి కుంభగిరి కొండయ్య, కవితాపీఠం సభ్యులు కే శరత్‌బాబు, రవిబాబు, అంకయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-25T05:28:17+05:30 IST