ఎన్టీఆర్‌కు నివాళి

ABN , First Publish Date - 2022-05-29T06:31:40+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు జయంతి వేడుకలను శనివారం పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు.

ఎన్టీఆర్‌కు నివాళి
బీచ్‌రోడ్డులో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు

మహారాణిపేట, మే 28: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు జయంతి వేడుకలను శనివారం పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. బీచ్‌ రోడ్డులోని ఎన్టీఆర్‌ విగ్రహానికి నాయకులు సూర్యనారాయణ, దాసరి వెంకటేశ్వరరావు, నక్కా కనకరాజు, టి.హర్షవర్దన్‌ప్రసాద్‌, నొల్లి నూకరత్నం, నడిగట్ల శంకరరావు, షేక్‌ జఫ్‌రుల్లా తదితరులు పూలదండలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యాలయానికి చేరుకుని  విగ్రహానికి నివాళులర్పించి, అనంతరం  పలు కార్యక్రమాలు నిర్వహించారు. 

Updated Date - 2022-05-29T06:31:40+05:30 IST