సేవ చేసిన అతివలకు సత్కారం

ABN , First Publish Date - 2021-03-01T10:01:35+05:30 IST

వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన, సేవలందించిన స్వయం సహాయక సంఘాల(ఎ్‌సహెచ్‌జీ)లోని మహిళలకు పురస్కారాలు అందించాలని, సన్మానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

సేవ చేసిన అతివలకు సత్కారం

8న సన్మానానికి సెర్ప్‌, మెప్మా ఏర్పాట్లు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన, సేవలందించిన స్వయం సహాయక సంఘాల(ఎ్‌సహెచ్‌జీ)లోని మహిళలకు పురస్కారాలు అందించాలని, సన్మానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌), పట్టణ పేదరిక నిర్మూలన పథకం(మెప్మా) ఆధ్వర్యంలో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ మేరకు సెర్ప్‌, మెప్మా ఏర్పాట్లు చేస్తున్నాయి. 

Updated Date - 2021-03-01T10:01:35+05:30 IST