దామచర్లకు ఘననివాళులు
ABN , First Publish Date - 2022-09-23T05:01:50+05:30 IST
మాజీమంత్రి, దివంగత ఆంజనేయులు 15వ వర్ధంతి సందర్భంగా గురువారం ఆయనకు పార్టీశ్రేణులు ఘనంగా నివాళులర్పించాయి. ఆయన ప్రాతినిధ్యం వహించిన కొండపితో పాటు ఒంగోలు నియోజకవర్గంలో వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. దామచర్ల కుటుంబం తరఫున స్వగ్రామమైన టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు.
తూర్పునాయుడుపాలెంలో రక్తదానం, మెగా మెడికల్ క్యాంపు
హాజరైన టీడీపీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు
ఒంగోలు, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : మాజీమంత్రి, దివంగత ఆంజనేయులు 15వ వర్ధంతి సందర్భంగా గురువారం ఆయనకు పార్టీశ్రేణులు ఘనంగా నివాళులర్పించాయి. ఆయన ప్రాతినిధ్యం వహించిన కొండపితో పాటు ఒంగోలు నియోజకవర్గంలో వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. దామచర్ల కుటుంబం తరఫున స్వగ్రామమైన టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. ఆంజనేయులు మనమడు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య పర్యవేక్షణలో మెగా మెడికల్ క్యాంపు, రక్తదాన శిబిరం, సభను నిర్వహించారు. సుమారు 800 మందికి సంఘమిత్ర వైద్యులు వైద్య పరీక్షలు చేయగా వందమంది రక్తదానం చేశారు. అలాగే కొండపి ఎమ్మెల్యే డాక్టర్ స్వామి అధ్యక్షతన ఆంజనేయులు వర్ధంతి సభ జరగ్గా టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, పార్లమెంట్ టీడీపీ పరిశీలకుడు బీసీ జనార్దన్రెడ్డి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, దామచర్ల మనమడు జనార్దన్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు డాక్టర్ దివి శివరాం, ఉగ్రనరసింహారెడ్డి, బీఎన్విజయకుమార్, కందుల నారాయణరెడ్డి, ఎం.అశోక్రెడ్డి, ఎరిక్షన్బాబు, నాగేశ్వరరావు, ఎంఎం కొండయ్య, పలువురు జిల్లా ముఖ్య నేతలు పాల్గొన్నారు. కొండపి నియోజకవర్గంలోని మండలకేంద్రాలు, పలు గ్రామాల్లో దామచర్ల విగ్రహాలు, చిత్రపటాలకు పార్టీశ్రేణులు నివాళులర్పించారు. ఇదిలా ఉండగా ఒంగోలులో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నేతృత్వంలో ఒంగోలులోని పార్టీ కార్యాలయంతోపాటు బాపూజీ కాంప్లెక్స్, కర్నూలు రోడ్డు ప్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఉన్న ఆంజనేయులు విగ్రహాలకు పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.