విశ్రాంత డీజీపీ ప్రసాదరావుకు నివాళులు
ABN , First Publish Date - 2021-05-11T04:11:16+05:30 IST
కరోనాతో మృతి చెందిన విశ్రాంత డీజీపీ బి.ప్రసాదరావుకి సీపీ మనీష్కుమార్సిన్హాతోపాటు ఇతర అధికారులు సోమవారం నివాళులు అర్పించారు.
విశాఖపట్నం, మే 10(ఆంధ్రజ్యోతి): కరోనాతో మృతి చెందిన విశ్రాంత డీజీపీ బి.ప్రసాదరావుకి సీపీ మనీష్కుమార్సిన్హాతోపాటు ఇతర అధికారులు సోమవారం నివాళులు అర్పించారు. పోలీస్ బ్యారెక్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసాదరావు చిత్రపటానికి పూలదండ వేసి సంతాపం తెలిపారు. 2002 మార్చి నుంచి 2005 జనవరి వరకు నగర పోలీస్ కమిషనర్గా బి.ప్రసాదరావు పనిచేయడంతో నగరవాసులు, అధికారులకు ఆయనతో అవినాభావ సంబంధం ఏర్పడిందని సీపీ అన్నారు. అప్పట్లో ఆయన అమలుచేసిన సంస్కరణలు ప్రజాదరణ పొందాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏడీసీపీ ఆదినారాయణ, రజిత, ఏసీపీ ప్రేమ్కాజల్ తదితరులు పాల్గొన్నారు.