AP News: దుర్గమ్మను దర్శించుకున్న త్రిదండి చినజీయర్ స్వామి

ABN , First Publish Date - 2022-10-02T01:15:42+05:30 IST

విజయవాడ: ఇంద్రకీలాద్రి‌పై కొలువైన దుర్గమ్మ అమ్మవారిని త్రిదండి చినజీయర్ స్వామి (Chinnagiyar Swamy) దర్శించుకున్నారు. ఈవో భ్రమరాంబ ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘దుర్గమ్మను దర్శిం

AP News: దుర్గమ్మను దర్శించుకున్న త్రిదండి చినజీయర్ స్వామి

విజయవాడ: ఇంద్రకీలాద్రి‌పై కొలువైన దుర్గమ్మ అమ్మవారిని  త్రిదండి చినజీయర్ స్వామి (Chinnageeyar Swamy) దర్శించుకున్నారు. ఈవో భ్రమరాంబ ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉంది. అందరూ సుఖంగా ఉండేలా చూడాలని అమ్మను ప్రార్థించా.  ప్రకృతి, పశుసంపద, పక్షులు బాగుంటేనే మనిషి సుఖపడతాడు.’’ అని పేర్కొన్నారు.


తాటికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. శరన్నవరాత్రోత్సవాల్లో అమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉంది.. అమ్మవారి కరుణాకటాక్షాలు అందరికీ ఉండాలని కోరుకున్నా అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Updated Date - 2022-10-02T01:15:42+05:30 IST