ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు క్రీడా పోటీలు

ABN , First Publish Date - 2022-08-10T05:21:54+05:30 IST

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా నూజివీడు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో నూజివీ డు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు.

ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు క్రీడా పోటీలు
క్రీడాపోటీలను ప్రారంభిస్తున్న ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ శ్రీనివాసరావు

నూజివీడు టౌన్‌, ఆగస్టు 9: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా నూజివీడు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో నూజివీ డు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. మంగళవారం హ్యాండ్‌బాల్‌, షటిల్‌, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌ క్రీడాంశాల్లో పోటీలను నూజివీడు ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ జి.వి.ఆర్‌ శ్రీనివాసరావు  ప్రారంభించారు. పీడీలు సూర్యచంద్రరావు, నవీన్‌కుమార్‌, వీరబాబు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T05:21:54+05:30 IST